Role of Andhra Mahasabha in bringing about poliical conciousness in Hyderabad princely state
ప్రశ్న : హైదరాబాద్ రాష్ట్రంలో రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడంలో ఆంధ్ర మహాసభ పాత్ర ఏమిటి?
జవాబు: - Download the answer in audio form - ఈ సమాధానాన్ని ఆడియో రూపంలో పొందండి
హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలన పౌరహక్కులను హరించడంతో, అక్కడి ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడం అత్యవసరమయ్యింది. ఈ అవసరాన్ని గుర్తించి, 1930లో ప్రారంభమైన ఆంధ్ర మహాసభ ఉద్యమం, ఆ ప్రాంత ప్రజల్లో రాజకీయ అవగాహనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ఇది నిజాం రాష్ట్రంలో ఏర్పడిన తొలి రాజకీయ సంస్థగా గుర్తించబడింది. మితవాదులు మరియు అతివాదుల నేతృత్వంలో ఏర్పడిన ఈ మహాసభ, స్వాతంత్ర్య స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించి ప్రజలలో స్వాభిమానాన్ని రేకెత్తించింది. ఈ మహాసభ ద్వారానే అనేక సామాజిక సమస్యలు చర్చకు వచ్చాయి, ప్రజల్లో ఉత్సాహం, చైతన్యం ఏర్పడింది.
1930లో మెదక్ జిల్లాలోని జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి నాయకత్వంలో నిజాం
రాష్ట్ర జనసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్ర మహాసభ ఒక రాజకీయ సంస్థగా
అవతరించింది.
ఆంధ్ర మహాసభ 1930లో స్థాపించబడింది. నిజాం
రాష్ట్రంలో ఏర్పడిన మొదటి రాజకీయ సంస్థ ఇదే.
ఆంధ్ర మహాసభ నేతలు:
ఆంధ్ర మహాసభ నాయకులను వారి ఆలోచనా ధోరణి ఆధారంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు:
1. మితవాదులు
2. అతివాదులు
మితవాదులు:
భారత జాతీయ కాంగ్రెస్ విధానాలను
అనుసరించిన ప్రథమ నేతలు ఎక్కువగా మితవాదులే. వీరు ప్రధానంగా అగ్రకులంగా భావింపబడే “పై తరగతుల” నుంచి వచ్చారు.
ప్రధాన మితవాది నాయకులు:
మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి,
బూరుగుల రామకృష్ణారావు, మందుముల నర్సింహారావు,
జమలాపురం కేశవరావు, పులిజాల వెంకటరంగారావు
మొదలైనవారు.
అతివాదులు:
స్థాపన తర్వాత కొన్ని సంవత్సరాల్లో
ఆంధ్ర మహాసభపై అతివాదులు అధికంగా ప్రభావం చూపారు.
ఉదాహరణ:
రావి నారాయణ రెడ్డి, బద్దం యెల్లారెడ్డి,
మక్దూం మొహియుద్దీన్, దేవులపల్లి
వెంకటేశ్వరరావు మొదలైనవారు.
1930 నుండి 1946
వరకు మొత్తం 13 ఆంధ్ర మహాసభ సమావేశాలు
నిర్వహించబడ్డాయి.
దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రయత్నాలతో ఆంధ్ర మహిళా సభ సమావేశాలు కూడా
ఆంధ్ర మహాసభ సమావేశాలతో కలిపి నిర్వహించబడ్డాయి.
1946 సమావేశం తర్వాత, మితవాదులు కాంగ్రెస్ పార్టీలోకి, అతివాదులు కమ్యూనిస్ట్ పార్టీలోకి చేరారు.
ఆరవముదు కమిటీ రాజకీయ సంస్కరణలపై ప్రతిపాదనలు ఇచ్చింది.
మొత్తంగా, 13 ఆంధ్ర మహాసభ సమావేశాలు నిర్వహించబడ్డాయి.
మొదటి సమావేశం – 1930 సంవత్సరంలో మెదక్ జిల్లాలోని జోగిపేట లో జరిగింది.
మొదటి
ఆంధ్ర మహాసభ అధ్యక్షులు సురవరం
ప్రతాపరెడ్డి, నడింపల్లి సుందరమ్మ.
మొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు: వాక్స్వాతంత్ర్యం, పత్రికా స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ లను హరిస్తూ
రూపొందించిన గస్తీ నిషాన్ – 53 చట్టాన్ని రద్దు చేయాలనే
తీర్మానం తీసుకున్నారు.
2వ సమావేశం 1931 లో దేవరకొండ లో జరిగింది. దీని అధ్యక్షులు: బూర్గుల రామకృష్ణారావు,
టి. వరలక్ష్మమ్మ.
తీర్మాణాలు: గస్తీ నిషాన్ – 53 చట్టాన్ని
రద్దు చేయాలన్న తీర్మానం తిరిగి చర్చించబడింది.
హాజరైన ప్రముఖులు:
- సినీ నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం
- ఆది హిందూ మహాసభ వ్యవస్థాపకుడు మాదరి భాగ్యరెడ్డి వర్మ
- రావి నారాయణ రెడ్డి తన స్నేహితునితో కలిసి కాలినడకన దేవరకొండకు చేరుకున్నాడు.
3వ సమావేశం 1934 లో ఖమ్మం లో జరిగింది.
అధ్యక్షుడు:
పులిజాల వెంకటరంగారావు
నిర్ణయం: దేవదాసీ వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానం.
4వ సమావేశం – 1935 లో సిరిసిల్ల లో జరిగింది.
అధ్యక్షులు:
మాడపాటి హనుమంతరావు, మాడపాటి మాణిక్యాంబ
నిర్ణయాలు:
- వేములవాడ భీమకవి నగర్ను ఏర్పాటు చేసి సభను నిర్వహించారు.
- స్వపరిపాలన సాధించాలనే తీర్మానం చేశారు.
- సభల్లో తెలుగు భాషను తప్పనిసరిగా వాడాలి అని నిర్ణయం.
- రావి నారాయణ రెడ్డి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు.
5వ సమావేశం – 1936 లో షాద్నగర్ లో జరిగింది.
అధ్యక్షుడు:
కొండా వెంకటరంగారెడ్డి
చర్చ: రైతుల సమస్యలపై చర్చ.
6వ సమావేశం – 1937 లో నిజామాబాద్ లో జరిగింది.
అధ్యక్షుడు:
మందుముల నర్సింగరావు
విశేషాలు:
జిల్లా కేంద్రంలో జరిగిన తొలి సమావేశం.
పౌరహక్కుల కోసం డిమాండ్ చేశారు.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు భాషలో ప్రసంగించాలని పేర్కొన్నారు. రావి నారాయణ రెడ్డి దీనికి వ్యతిరేకించారు.
7వ సమావేశం – 1940 లో మల్కాపురం లో జరిగింది.
అధ్యక్షుడు:
రామచంద్రరావు
చర్చ: అరవముదు కమిటీ రాజకీయ సంస్కరణల నివేదికపై తీవ్ర వ్యతిరేకత.
8వ సమావేశం – 1941 లో చిలుకూరు లో జరిగింది.
అధ్యక్షుడు:
రావి నారాయణ రెడ్డి
నిర్ణయాలు:
సభ్యత్వ రుసుమును ఒక అణా నుండి నాలుగు అణాలకు పెంచారు.
సభల్లో తెలుగు భాషను తప్పనిసరిగా వాడాలనే నిబంధనను రద్దు చేశారు.
9వ సమావేశం – 1942 లో ధర్మవరం లో జరిగింది.
అధ్యక్షుడు:
కోమటేశ్వరరావు
విశేషం: అత్యవాదుల ప్రభావం స్పష్టంగా పెరిగింది.
10వ సమావేశం – 1943 లో హైదరాబాద్ లో జరిగింది.
అధ్యక్షుడు:
కె.వి.రంగారెడ్డి
విశేషాలు:
అధ్యక్ష ఎన్నికలు తొలిసారి ప్రజల మధ్య ఓటింగ్ ద్వారా జరిగాయి.
ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపనపై చర్చ జరిగింది.
11వ సమావేశం – 1944 లో భువనగిరి లో జరిగింది.
అధ్యక్షుడు:
రావి నారాయణ రెడ్డి
నిర్ణయాలు:
సభ్యత్వ రుసుము నాలుగు అణాలకు తగ్గించబడింది.
మితవాదులు, అతివాదులుగా సభ్యులు విభజన చెందారు.
వేర్వేరు సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం.
గ్రామీణ ప్రాంతాల్లో ఆంధ్ర మహిళా సభ శాఖలు ఏర్పాటయ్యాయి.
12వ సమావేశం – 1945 లో జరిగింది.
(1) మడికొండ
(వరంగల్ జిల్లా) – మితవాదుల సమావేశం జరిగింది.
అధ్యక్షుడు: మందుముల నర్సింగరావు
(2) ఖమ్మం –
అతివాదుల సమావేశం జరిగింది.
అధ్యక్షుడు: రావి నారాయణ రెడ్డి
విశేషం: ప్రసిద్ధ బుర్రకథ కళాకారుడు నాజర్ సభలో పాల్గొన్నారు.
13వ సమావేశం 1946 లో మితవాదులు, అతివాదులు వేరువేరుగా నిర్వహించారు.
మెదక్
జిల్లా లోని కంది లో మితవాదుల సమావేశం
జరిగింది.
దీని అధ్యక్షుడు: జమలాపురం కేశవరావు
విశేషం: ఇది మితవాదుల చివరి ఆంధ్ర మహాసభ సమావేశం జరిగింది.
కరీంనగర్
లో అతివాదుల సమావేశం జరిగింది.
అధ్యక్షుడు: బద్దం ఎల్లారెడ్డి
విశేషం: ఇది అతివాదుల చివరి ఆంధ్ర మహాసభ సమావేశం.
ఈ విధంగా, ఆంధ్ర మహాసభ 1930 నుండి
1946 వరకు మొత్తం 13 సమావేశాలు
నిర్వహించబడినవి, చివర్లో మితవాదులు మరియు అతివాదులు
వేర్వేరుగా సమావేశాలు జరిపారు. చివరికి, మితవాదులు కాంగ్రెస్
పార్టీలోకి, అతివాదులు కమ్యూనిస్టు పార్టీలోకి చేరడం ద్వారా
ఆంధ్ర మహాసభ తన స్వతంత్ర రాజకీయ పాత్రను ముగించింది. నిజంగా, ఆంధ్ర మహాసభ సమావేశాలు —
రాజకీయంగా, సామాజికంగా — ప్రజల మనోభావాలను ప్రతిబింబించాయి. ప్రతి సమావేశం ప్రత్యేకతను
సంతరించుకుంది. వివిధ సమస్యలపై చర్చలు జరిగాయి; స్వపరిపాలన,
భాషా విధానం, పౌరహక్కులు, మహిళా సాధికారత, రైతుల సమస్యలు మొదలైన అంశాలు
కేంద్రంగా చర్చలు జరిగాయి.
ఈ సమావేశాల ద్వారా మహాసభ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి, నిరంకుశ పాలన వ్యతిరేక సంఘటిత ఉద్యమానికి బలం చేకూర్చింది.
క్ర.సంఖ్య |
సంవత్సరం |
స్థలం |
అధ్యక్షులు |
రిజల్ట్ |
1 |
1930 |
జోగిపేట |
సురవరం ప్రతాపరెడ్డి , నడింపల్లి సుందరమ్మ |
వాక్ – స్వాతంత్ర్యం, పత్రికా స్వేచ్చ, సభలు సమావేశాలు నిర్వహించే స్వేచ్చను హరిస్తూ 1926 లో గస్తీనిషాన్ – 53 అనే చట్టాన్ని చేసారు. ఈ సభలో గస్తి నిషాన్ – 53 ని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. |
2 |
1931 |
దేవరకొండ |
బూర్గుల రామకృష్ణా రావు - టి. వరలక్ష్మమ్మ |
1. 53 ని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. 2. పలువురు ప్రముఖులు హాజరయ్యారు 1. సినీ నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం, 2. ఆది హిందూ మహా సభ వ్యవస్ధాపకులు మాదరి భాగ్యరెడ్డి వర్మ, 3. తన స్నేహితునితో కలిసి కాలి నడకన రావి నారాయణ రెడ్డి దేవరకొండకు చేరుకున్నారు. |
|
||||
3 |
1934 |
ఖమ్మం |
పులిజాల వెంకట రంగారావు |
దేవదాసీ వ్యవస్ధను నిషేధించాలని నిర్ణయంతీసుకున్నారు. |
4 |
1935 |
సిరిసిల్ల |
మాడపాటి హనుమంతరావు - మాడపాటి మాణిక్యాంబ |
1. ఈ సమావేశ నిర్వహణకై వేములవాడ భీమకవి నగర్ ను నిర్మించారు. 2. స్వపరిపాల కోసం నిర్ణయం తీసుకున్నారు. 3. ఆంధ్ర మహా సభ సమవేశాల్లో తెలుగు భాషను మాత్రమే వాడాలని నిర్ణయం తీసుకున్నారు. 4. రావి నారాయణ రెడ్డి దీనిని అంగీకరించలేదు. |
5 |
1936 |
షాద్ నగర్ |
కొండా వెంకట రంగారెడ్డి |
రైతుల సమస్యల గూర్చి చర్చించారు. |
6 |
1937 |
నిజామాబాద్ |
మందుముల నర్సింగరావు |
జిల్లా కేంద్రంలో జరిపిన మొదటి సమావేశం. పౌర హక్కులకోసం డిమాండ్ చేసారు. సురవరం ప్రతాపరెడ్డి సమావేశాల్లో తెలుగు భాషలోనే ప్రసంగించాలని అన్నారు. రావి నారాయణ రెడ్డి దానిని వ్యతిరేకించారు. |
7 |
1940 |
మల్కాపురం |
రామచంద్ర రావు |
అరవముద కమిటీ రిపోర్టు గూర్చి చర్చ జరిగింది దానిని వ్యతిరేకించారు. |
8 |
1941 |
చిలుకూరు |
రావి నారాయణ రెడ్డి |
సభ్యత్వ రుసుమును ఒక అణా నుండి నాలుగు అణాలకు పెంచడం జరిగింది. ఈ సభల్లో తెలుగు ను ఖచ్చితంగా వాడాలనే నిబంధనను కూడా తొలగించారు. |
9 |
1942 |
ధర్మవరం |
కోమటేశ్వర రావు |
అతి వాదుల ప్రభావం పెరిగింది. |
10 |
1943 |
హైదరాబాద్ |
కె.వి. రంగారెడ్డి |
అధ్యక్ష పదవికై మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు స్ధాపన గూర్చి చర్చలు జరిగాయి. |
11 |
1944 |
భువనగిరి |
రావి నారాయణ రెడ్డి |
సభ్యత్వ రుసుము నాలుకు అణాలకు తగ్గించబడింది. అతివాదులు, మితవాదులుగా సభ్యులు విడిపోయారు. వేరు వేరుగా సమావేశాల్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. * సంఘాలు, ఆంధ్రమహిళా సభ శాఖలు గ్రామీణ ప్రాంతాల్లోకూడా నెలకకొల్పడం జరిగింది. |
12(1) |
1945 |
మడికొండ – మితవాద (వరంగల్) |
మందుముల నర్సింగరావు
|
|
12(2) |
ఖమ్మం అతివాద |
రావి నారాయణ రెడ్డి |
నాజర్ అనే బుర్రకథ కళాకారుడు హాజరయ్యారు. |
|
13(1) |
1946 |
కంది(మెదక్) (మితవాద) |
జమలాపురం కేశవరావు |
చివరి సమావేశం |
13(2) |
కరీ నగర్ |
బధ్ధం ఎల్లారెడ్డి |
చివరి సమావేశం |
No comments:
Post a Comment